పరిగి టౌన్ : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పరిగి మండల పరిధిలోని పెద్ద మాదారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై క్రాంతికుమార్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని రాంచెందర్ (30) వృత్తిరీత్య ఇళ్లకు రంగులు వేస్తూ జీవిస్తుండేవాడు. ఆర్థిక పరిస్థితులు బాగలేనందున ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. పెట్టుబడుల కోసం సుమారు రూ. 4లక్షలకు పైగా ఇతరుల వద్ద అప్పు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు. భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.