కులకచర్ల : అప్పు తీసుకున్న డబ్బులు ఇవ్వమని తెల్చి చెప్పడంతో మనస్థాపానికి గురైన మహిళ కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన కాశీరాం 20 సంవత్సరాల క్రితం బ్రతుకు దెరువు కోసం కులకచర్ల మండలానికి వచ్చారు. కులకచర్లలో ఒక ఇంట్లో అద్దెకు నివాసముంటూ కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గత సంవత్సరం ఆరు నెలల క్రితం కాశీరామ్ అతని భార్య కాశమ్మ(35) కులకచర్ల గ్రామానికి చెందిన పెద్ద కాశీరాంకు రూ. 1,10,000లు, 55తులాల వెండి కడియాలు, బంగారు గుండ్లు అప్పుగా ఇచ్చారు. చిన్న కాశీరామ్కు రూ. 1,10,000లు అప్పు ఇచ్చారు. వీరు ఇద్దరు అన్నదమ్ములు.
అదే విధంగా కులకచర్ల గ్రామానికి చెందిన మరో వ్యక్తి సాయిరాంకు రూ. 30వేలు అప్పు ఇచ్చారు. ఇట్టి పైసల విషయంలో తనకు డబ్బులు తిరిగి ఇవ్వాలని మూడుసార్లు పంచాయతీ పెట్టించి మాట్లాడగా జనవరి 1న ఇస్తామని ఒప్పుకున్నారని జనవరి 1న పై ముగ్గురికి ఫోన్చేసి తనడబ్బులు ఇవ్వమని అడిగితే బూతుమాటలు తిట్టడంతో పాటు డబ్బులు ఇవ్వమని తేల్చి చెప్పరన్నారన్నారు. డబ్బులు ఇవ్వకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని కాశమ్మ తెలియజేసిన చేసుకొమ్మని అనడంతో కులకచర్లలో ఉన్న కుంటలో దూకి ఆత్మహత్య చేసుకుందని మృతురాలు భర్త కడమంచి కాశీరామ్ తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.