లలిత్పూర్: ఒక మైనర్ బాలికపై ఆమె తండ్రి సహా 28 మంది అత్యాచారానికి పాల్పడిన ఘోరమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను 6వ తరగతి చదువుకుంటున్న సమయంలో తండ్రి బలవంతంగా పోర్నోగ్రఫీ చూపించాడని బాధితురాలు ఆరోపించింది. కొంతకాలానికి పొలాలకు తీసుకెళ్లిన తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడించింది.
ఆ తర్వాత తనను రెగ్యులర్గా కొన్ని హోటళ్లకు తీసుకెళ్లేవాడని, అక్కడ చాలా మంది వ్యక్తులు తనపై లైంగిక దాడులు చేశారని ఆమె పోలీసులకు తెలిపింది. ఇలా చాలా ఏళ్లుగా తనపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, పలువురు రాజకీయ నేతలు కూడా తనను బలాత్కరించారని సదరు యువతి ఆరోపించింది.
ప్రస్తుతం బాధితురాలి వయసు 17 సంవత్సరాలు కావడంతో ఈ కేసులో పోక్సో సెక్షన్ కూడా చేర్చడం జరిగింది. ఈ కేసు చాలా సున్నితమైనదని, చాలా సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసు అధికారులు చెప్పారు.
నిందితుల్లో బీఎస్పీ, ఎస్పీ రాజకీయ పార్టీలకు చెందిన జిల్లా స్థాయి నేతల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తనపై కుట్ర జరుగుతోందని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత తిలక్ యాదవ్ ఆరోపిస్తున్నారు. తన నేరం రుజువైతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు.