మావోయిస్టులకు ధనసాయం అందిస్తున్నందుకు ఒక బెంగాలీ వ్యాపారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జార్ఖండ్లో మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో మహేష్ అగర్వాల్ అనే బిజినెస్మేన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి.. మహేష్కు అధికార తృణమూల్ కాంగ్రెస్తో సంబంధాలున్నాయని ఆరోపించాడు. దేశ విద్రోహ శక్తులకు సాయం చేసినందుకు మహేష్పై అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి వచ్చిన ఎన్ఐఏ బృందం.. కోల్కతా పోలీసులతో కలిసి మహేష్ను అదుపులోకి తీసుకుంది. సాల్ట్లేక్ ప్రాంతంలో మహేష్ చిక్కాడు. ఈ కేసు విషయంలో ఎన్ఐఏ ఎటువంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు.