Crime news: అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ భర్త ఆమెను కలపను చెక్కే ఉలితో కోసి చంపాడు. దేశ రాజధాని ఢిల్లీలోని బురారి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం తెల్లవారుజామున సత్య విహార్ ఏరియాలో ఓ 40 ఏళ్ల మహిళ రక్తపు మడుగులో పడి ఉందని సమాచారం అందుకున్న బురారీ పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఆమెను హుటాహుటిన బురారీ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆమె భర్తే హత్య చేసినట్టుగా తేలింది. తన భార్య ఈ మధ్య తనను దూరం పెడుతోందని, ఇతరులతో వివాహేతర సంబంధం కారణంగానే ఆమె అలా చేస్తోందనే అనుమానంతో హత్య చేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. పోలీసులు నిందితుడిని అదపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.