Crime News | ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిందామె. కానీ బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతోంది. భార్యకు వచ్చిన బాధను చూడలేక ఆమె భర్త కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. భార్యను తీసుకొని చాలా ఆస్పత్రులు తిరిగాడు.
అప్పుడుగానీ అసలు విషయం తెలియలేదు. ఇంతకీ ఏం జరిగందంటే.. గురుగ్రామ్కు చెందిన దివాస్ రాయ్, స్వాస్తిక దంపతులు. స్వాస్తికకు ఇటీవలే డెలివరీ అయింది. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఆమెకు డెలివరీ చేశారు.
ఆ సమయంలో కాటన్ స్వాబ్స్ను ఆమె కడుపులోనే మర్చిపోయారు వైద్యులు. వాటిని అలాగే వదిలేసి కుట్లు వేసేశారు. అప్పటి నుంచి ఆమె కడుపునొప్పి తో బాధపడుతోంది. చాలా ఆస్పత్రులు తిరిగిన తర్వాత ఈ విషయం బయటపడిందని దివాస్ తెలిపారు. దీంతో అతను కేసు వేశాడు. దీనిపై విచారణ జరిపిన గురుగ్రామ్లోని ఒక కోర్టు.. సదరు ఆస్పత్రిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.