బొంరాస్పేట : కరెంట్ షాక్ కొట్టి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన బొంరాస్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిల్ముల్మైలారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాశం రాంరెడ్డి కుమారుడు పాశం నవదీప్రెడ్డి(15) ఉదయం 7.45 గంటలకు నీళ్లు పట్టడానికి ఇంటి ముందు ఉన్న నల్లాకు మోటరు పెట్టడానికి ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే కొడంగల్ దవాఖానకు తరలిస్తుండగా మార్గ మాధ్యలో మృతి చెందాడు. తండ్రి రాంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటనారాయణ తెలిపారు. నవదీప్రెడ్డి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువు తున్నాడు. కుమారుడి మృతితో కుటుంబంలో విషాధచాయలు అలముకున్నాయి.