తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో లేకుండా తమ ఐదేళ్ల పాపను మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్లారు. అదే వాళ్లు చేసిన తప్పు అయింది. ఇంట్లో పసిపాప ఒంటరిగా ఉండటం చూసిన పొరుగింటిలోని దుర్మార్గుడు.. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్లో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘాతుకానికి పాల్పడిన కామాంధుడిని రికేష్గా గుర్తించారు.
22 ఏళ్ల రికేష్ తమ పొరుగింట్లో ఉండే కుటుంబం బయటకు వెళ్లడం చూశాడు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న ఐదేళ్ల చిన్నారిని బలాత్కరించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని పాపను బెదిరించాడు కూడా. అయితే ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పాప ముభావంగా ఉండటం చూసి ఆరాతీశారు. విషయం తెలియడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.