ఎడపల్లి(శక్కర్నగర్) : ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గోవర్దన్ హర్షిణీ(30) అనే వైద్యురాలు సొంత ఇంట్లొ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎడపల్లి ఎస్ఐ ఎల్లాగౌడ్ తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హర్షిణీ ఎంబీబీఎస్ పూర్తి చేసి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిన వైద్యురాలిగా పనిచేస్తుంది. ఈ నెల 10న రాత్రి గదిలోకి వెళ్లి పడుకుంది. రాత్రి 2 గంటల సమయంలో ఆమె తండ్రి చంద్రప్రకాశ్ కూతురుని పిలువగా స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఆమె సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మృతురాలి హర్షిణీ మానసిక పరిస్థితి సక్రమంగా ఉండేది కాదని, మానసిక వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్న సమయంలో ఈ సంఘటనకు పాల్పడిందని మృతురాలి తండ్రి చంద్రప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.