భువనేశ్వర్: ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఒక వైద్యుడి ఇంట్లో కోట్లలో డబ్బులు బయటపడ్డాయి. ఆ డాక్టర్పై అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఒడిశాలోని పూరీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో విధులు నిర్వహించే డాక్టర్ ఎస్కే జెనా సిజేరియన్ కోసం రూ.8000 లంచం డిమాండ్ చేశాడు. ఆ డబ్బును తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డాడు.
ఈ నేపథ్యంలో ఒడిశా విజిలెన్స్ డిమార్ట్మెంట్ అధికారులు గురువారం డాక్టర్ ఎస్కే జెనా ఇంట్లో సోదాలు నిర్వహించారు. పాలిథిన్ కవర్లలో ఉంచి దాచిన రూ. 1.12 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ వైద్యుడిపై వచ్చిన అవినీతి ఆరోపణలతోపాటు అక్రమ ఆస్తులపై దర్యాప్తు చేస్తున్నారు.