బంజారాహిల్స్ : ప్రేమిస్తున్నానని నమ్మించడంతో పాటు పెళ్ళి పేరుతో చాలా రోజులుగా సహజీవనం చేస్తున్న ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఫిలింనగర్లోని జ్ఞానిజైల్సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న కావలి అనురాధ (22) సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్గా పని చేస్తుంది. గత కొంత కాలంగా కిరణ్ అనే యువకుడితో ప్రేమలో ఉన్న అనురాధ అతడితో కలిసి సహజీవనం చేస్తున్నది.
పెళ్ళి చేసుకుంటానని నమ్మించిన కిరణ్ ఇటీవల మరో యువతితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని తెలిసింది. ఈ విషయంపై కొద్ది రోజులుగా వారిద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం కిరణ్ ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనురాధ తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
రెండు రోజుల తర్వాత ఆమె గది నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు మృతురాలి సోదరి సరోజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు కిరణ్పై ఐపీసీ 306, 509, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.