పుదుచ్చేరి: తన కుమార్తె కంటే ఎప్పుడూ టాప్ ర్యాంక్ తెచ్చుకుంటున్న విద్యార్థిపై ఒక తల్లి ఈర్ష్య పడింది. విషం కలిపిన కూల్ డ్రింక్ను ఆ విద్యార్థితో తాగించి హత్య చేసింది. పుదుచ్చేరిలోని కారైక్కల్లో ఈ దారుణం జరిగింది. నెహ్రూ నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలమణికందన్ అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. అతడు ఎప్పుడూ క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు. అయితే అదే క్లాస్కు చెందిన బాలికకు రెండో ర్యాంక్ వచ్చేది. దీనిని ఆమె తల్లి విక్టోరియా సహ్యారాణి సహించలేకపోయింది. ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వచ్చే బాలమణికందన్పై ఆమె అసూయ చెందింది.
ఈ నేపథ్యంలో శనివారం సహ్యారాణి ఆ స్కూల్కు వెళ్లింది. విషం కలిపిన కూల్డ్రింక్ను ఫస్ట్ ర్యాంకర్ బాలమణికందన్కు ఇచ్చింది. డ్రింక్ తాగిన అతడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకోవడంతో కంగారు పడిన విద్యార్థి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ విద్యార్థి మరణించాడు. అతడు తాగిన కూల్డ్రింక్లో విషం కలిపినట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలింది. దీంతో విక్టోరియా సహ్యారాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.