హైదరాబాద్: చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను (Child Selling Gang) రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు కూడా ఉన్నారు. పిర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితోపాటు 11 మందిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ నగర్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా 3 నెలల పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు విక్రయిస్తున్నారు.
ఇటీవల మేడిపల్లిలోని చిన్నారుల విక్రయంతో ముఠా ఆగడాలు బయపడ్డాయి. పోషించడం భారమంటూ తల్లులకు చెప్పి.. పిల్లలు లేనివారికి ఇస్తామంటూ వారిని నమ్మించి అమ్మేస్తున్నారని తెలిపారు. ఇలా ఇప్పటివరకు మొత్తం 50 మందిని అమ్మినట్లు గుర్తించారు.