పహాడీషరీఫ్ : వదిన తన భార్యను తన వద్దకు పంపించడం లేదని మరిది ద్వేషంతో ఆమె కుమారుడుని దారుణంగా హత్య చేసిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మధుమోహన్ వివరాల ప్రకారం మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీగూడలోని రాజీవ్గృహకల్పలో నివాసముంటున్న రాజు, మహేశ్వరి దంపతులు.
మహేశ్వరి సినీ కళాకారిని. వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీతన, తేజశ్వి ఉన్నారు. రాజు మరణించిన అనంతరం వినోద్ కుమార్రెడ్డి అనే వ్యక్తిని మరో వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు సంతానం అతని పేరు లక్ష్మీనర్సింహ్మ అలియాస్ లక్కీ (04).
కాగా ఈమె చెల్లెలు భర్త బోల్లారంలో నివాసముండే వీరేశ్తో గొడవ కారణంగా సంవత్సరం కాలంగా శ్రీరామకాలనీలోని అమ్మగారి ఇంటి వద్ద ఉంటుంది. అయితే వదిన తన భార్య లక్ష్మీని తన వద్దకు పంపడం లేదని వదిన మహేశ్వరిపై వీరేశ్ ద్వేషం పెంచుకున్నాడు.
శనివారం ఉదయం 9 గంటల సమయంలో రాజీవ్గృహకల్ప నుంచి లక్ష్మీనర్సింహ్మ అలియాస్ లక్కీని తీసుకెళ్లాడు. సాయంత్రం జల్పల్లి ఇందిరా సొసైటీ డంపింగ్ వద్ద నిర్మానుష ప్రాంతంలో బాలుడి మెడకు వైర్తో చుట్టి హత్య చేశాడు. డయల్ 100 సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాలుడు అదృశ్యయ్యమయ్యాడని తల్లి మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్లోఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.