హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో చోరీలకు పాల్పడతున్న యువకుడిని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. జవహర్నగర్లో సందీప్ చారి అనే యువకుడు కొంతకాలంగా చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిఘాపెట్టిన పోలీసులు ఇవాళ అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా సందీప్ చారి 6 గొలుసులు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని నుంచి 80 గ్రాముల బంగారం, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు.