కార్వాన్ : ఈ నెల 17న టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్స్నాచింగ్కు పాల్పడిన దొంగను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ జి.సంతోష్ కుమార్, అదనపు ఇన్స్పెక్టర్ ప్రసాద్తో కలిసి వివరాలు వెల్లడించారు. జహీరాబాద్కు చెందిన నదీం (21) మార్బుల్ స్టోన్ వర్కర్గా పనిచేస్తూ జిర్రాలోని కిషన్ నగర్లో నివసిస్తున్నాడు.
ఈ నెల 17న ఉదయం మలైమెట్ బస్తీలో అర్చన అనే మహిళ తన ఇంటిముందు వాకిలి ఊడుస్తుండగా అటుగా నడుచుకుంటూ వచ్చిన నదీం అర్చన మెడలో నుండి మంగళసూత్రాన్ని తెంపుకొని పారిపోయాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల అధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని కోర్టులో హజరుపరిచి రిమాండ్కు తరలించారు.