కాచిగూడ : జల్సాలకు అలవాటుపడి రద్దీగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న యువకున్ని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అడిషనల్ ఇన్స్పెక్టర్ సిహెచ్.యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్, కేసరం గ్రామానికి చెందిన డి.మహేశ్కుమార్(20) మద్యానికి బానిసయ్యాడు.
కాగా అవసరమైన డబ్బుల కోసం రద్దీగా ఉన్న ప్రాంతల్లో సెల్పోన్లు, బైక్లను దొంగిలిస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తుంటారు. ఆదివారం రాత్రి 11 గంటలకు ఇద్దరు యువతులు ఆటోలో రాంనగర్ నుండి ఇమ్లీబన్ బస్ స్టేషకు వెలుతుండగా మార్గమధ్యలో నింబోలిఅడ్డా సిగ్నల్ దగ్గర మహేశ్కుమార్ వచ్చి ఆటోలోని యువతి చేతిలో ఉన్న ఖరీదైన సెల్ఫోన్ను తీసుకొని పారిపోయారు.
అదే సమయంలో పెట్లబుర్జులో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న మహిళ కానిస్టేబుల్ పరుగెత్తుతున్న మహేశ్ కుమార్ను రెడ్హ్యాండ్గా పట్టుకుని కాచిగూడ పోలీసులకు అప్పగించింది. కాచిగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సెల్పోన్ను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. ఆతని నుంచి సెల్పోన్ను స్వాధీనం చేసుకొని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్సై రాజేంద్రన్ తెలిపారు.