కాచిగూడ : రైల్వే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై దాడిచేసిన వ్యక్తిపై కాచిగూడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి జిల్లా ఆలేర్ ప్రాంతానికి చెందిన కట్కారి శ్రీనివాస్ (41) రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 22 న ఉప్పుగూడ రైల్వేస్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు.
అదే రోజు రాత్రి విక్రంసింగ్ అనే వ్యక్తి ఉప్పుగూడ రైల్వేస్టేషన్లో అనుమానస్పదంగా కన్పించగా స్టేషన్ బయటకు వెళ్లాలని సూచించాడు. దీంతో ఆవేశంతో విక్రంసింగ్ శ్రీనివాస్ పై దాడిచేశాడు. శ్రీనివాస్ కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ లక్ష్మణాచారి పేర్కొన్నారు.