రంగారెడ్డి : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన్మదిన వేడుకలు జరుపుకున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని బాక్స్ ఫామ్హౌజ్లో వరుణ్గౌడ్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలను గడిచిన అర్థరాత్రి ఘనంగా నిర్వహించారు. పార్టీపై సమాచారం అందుకున్న కడ్తాల్ పోలీసులు ఎస్వోటీ సిబ్బందితో వెళ్లి ఫామ్హౌజ్పై రైడ్ చేశారు. ఈ సందర్భంగా మొత్తం పార్టీ నిర్వాహకులను, పాల్గొన్నవారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో దాదాపు 21 మంది యువతులు ఉన్నట్లు సమాచారం. వీరందరినీ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలం నుండి పెద్దఎత్తున మద్యం సీసాలు, సౌండ్ సిస్టమ్ను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహాకులు ఏ1 గా కె. భరత్(24), ఏ2 గా జీషాన్(26), ఏ3 గా అన్వేష్(24) కాగా ఏ4 వరుణ్ గౌడ్ పరారీలో ఉన్నాడు.