పరిగి టౌన్ : పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి ఏడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తొండపల్లి-చిట్యాల్ గ్రామ శివార్లలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని అందిన పక్కా సమాచారంతో దాడి చేయడంతో కొంతమంది వ్యక్తులు పారిపోయారని అక్కడే ఉన్న మల్లేష్, సత్తయ్యలపై కేసు నమోదు చేసి ఏడు బైకులు, 10,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.