హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వైపునకు వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
కారు రోడ్డుకు అడ్డంగా బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఆ వాహనాన్ని పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.