కేపీహెచ్బీ కాలనీ/ఉప్పల్, మే 6 : ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేపీహెచ్బీ కాలనీ పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జి.వి.సాగర్(30) కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో నివాసముంటూ.. మంజీరామాల్లోని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
కొవిడ్తో ఇబ్బందులు పడుతున్న ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకున్న సాగర్ అధిక ధరలకు రెమ్డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో మంజీరామాల్లోని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో పోలీసులు తనిఖీ చేయగా.. ఇంజక్షన్లను విక్రయిన్న సాగర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రెమ్డెసివిర్ ఇంజక్షన్తో పాటు బైక్, సెల్ఫోన్, ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు.