సినీనిర్మాత అయేషా వ్యాఖ్య.. దేశద్రోహం కేసు నమోదు
న్యూఢిల్లీ, జూన్ 11: కేంద్ర ప్రభుత్వం లక్షదీవుల్లోని ప్రజల పైకి పరిపాలనాధికారి ప్రఫుల్ పటేల్ను జీవాయుధంగా ప్రయోగించిందని సినీ నిర్మాత అయేషా సుల్తానా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై లక్షద్వీప్ బీజేపీ యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. ఐపీసీ సెక్షన్ 124(దేశద్రోహం), సెక్షన్ 153బీ(విద్వేష ప్రసంగం)ల కేసులు నమోదు చేశారు.