లక్నో : మహిళలపై వేధింపులకు అడ్డాగా మారిన యూపీలో మరో దారుణం వెలుగుచూసింది. బీఎస్సీ విద్యార్దినిపై కాలేజ్ వాష్రూంలో లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహరాజ్గంజ్లో జరిగింది. వాష్రూం నుంచి బయటపడిన విద్యార్ధిని ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది.
కాలేజ్కు చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. పెనుగులాటలో గాయపడిన విద్యార్ధినిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరీక్షలు ముగిసిన అనంతరం శుక్రవారం ఈ ఘటన జరిగింది.
నిందితుడిపై బాదితురాలి సోదరుడు ఫిర్యాదు చేశారు. తాను వాష్రూంలో ఉండగా ముఖానికి మాస్క్లు ధరించిన ఇద్దరు నిందితులు తన దుస్తులు తొలగించి లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారని తాను వారిలో ఒకరి చేయి కొరికి ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డానని బాధితురాలు వెల్లడించింది.