శంషాబాద్ రూరల్ : మతిస్థిమితంలేని మరదలుపై బావ లైంగికదాడి చేసిన సంఘటన శంషాబాద్ ఆర్ జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహ కల్పలో నివాసముండే మహిళకు ఇద్దరు కూతుర్లు మొదటి కూతురుకు పెండ్లి చేయగా, రెండోకూతురుకు మతిస్థిమితం లేదు.
కాగా మొదటి కూతురు తన భర్త శ్రీనుతో కలిసి శంషాబాద్ లోని రాజీవ్ గృహకల్పలో నివాసముంటుంది. ఈ క్రమంలో మతిస్థిమితంలేని మరదలుపై కన్నేసిన ఆమె బావ గత నాలుగు రోజుల క్రితం లైంగికదాడి చేశాడు. నాలుగు రోజులుగా దిగులుగా ఉంటున్నయువతిని కుటుంబ సభ్యులు అనుమానంతో అడుగగ అసలు విషయం బయటకు వచ్చింది.
దీంతో తల్లి అల్లున్ని నిలదీయడంతో అతను తప్పు ఒప్పుకున్నాడు. ఆమె శంషాబాద్ ఆర్ జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.