పట్నా : బిహార్ రాజధాని పట్నా సివిల్ కోర్టులో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. పేలుడు సమాచారం రాగానే హుటాహుటిన ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసు అధికారులు పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు.
తేలికపాటి పేలుడు కావడంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పేలుడుకు కారణాలేంటనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు.