గుర్గావ్ : ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్లో దారుణం జరిగింది. స్థానిక బీజేపీ నాయకుడు సుఖ్బీర్ ఖతనాపై బుల్లెట్ల వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం సమయంలో సుఖ్బీర్.. గురుద్వారా రోడ్డులో ఉన్న ఓ క్లాత్ షోరూమ్కు వెళ్లాడు. అప్పటికే ఆ షోరూమ్లో సాధారణ వ్యక్తుల్లా మకాం వేసిన ఓ ఐదుగురు దుండగులు.. బీజేపీ నాయకుడిపై తుపాకితో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
కాల్పుల మోతకు భయపడ్డ షోరూమ్ సిబ్బంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. కొందరు షోరూమ్లోనే తలదాచుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న సుఖ్బీర్ను ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యపై పోలీసులు విచారణ చేపట్టారు. క్లాత్ షోరూమ్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సుఖ్బీర్ చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్కు అత్యంత సన్నిహితుడు.