పాట్నా: దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యాపారవేత్త మరణించాడు. ఆయన భార్యకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. బీహార్లోని కతిహార్లో పట్టపగలు ఈ సంఘటన జరిగింది. కేలబరి గ్రామానికి చెందిన 35 ఏళ్ల మేఘనాథ్ యాదవ్ బిజినెస్ చేస్తున్నాడు. శనివారం ఉదయం భార్యతో కలిసి బైక్పై స్థానిక గుడికి వెళ్లి పూజలు చేశాడు. అనంతరం బైక్పై తిరిగి వస్తుండగా బైక్పై వచ్చిన దుండగులు సమీపం నుంచి తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయారు. బీహార్-పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని అజంనగర్ పల్సా-బక్చల్లా రహదారిపై ఈ సంఘటన జరిగింది. దీంతో బైక్ నడుపుతున్న మేఘనాథ్ కింద పడిపోయాడు. బైక్పై ఆయన వెనుక కూర్చొన్న భార్యకు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి.
స్పందించిన స్థానికులు వ్యాపారవేత్త మేఘనాథ్ను అజంనగర్ ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బుల్లెట్ గాయాలైన ఆయన భార్య కతిహార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. పోలీసులు మేఘనాథ్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కతిహార్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.