అమరావతి : గుంటూరు జిల్లా దుగ్గిరాలలో రెండు రోజుల క్రితం జరిగిన అత్యాచారం, హత్య ఘటనను మరచిపోకముందే అదే మండలంలో మరో మహిళపై అత్యాచార యత్నం జరగడం సంచలనం కలిగిస్తోంది. వ్యవసాయ కూలీ పనుల కోసం వచ్చిన మహిళ అక్కడే ఆలయంలో నిద్రించింది. ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమెను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేయగా ఆమె కేకలు వేయడంతో యువకుడు పారిపోయాడు.
తోటి కూలీలు డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడు వాడిన వాహనాన్ని ఆలయ సమీపంలో గుర్తించిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బైక్ నంబర్ ఆధారంగా యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.