శంషాబాద్ రూరల్ : ఎయిర్పోర్టులో ఉద్యోగిపై ఓ వ్యక్తి మద్యం మత్తులో దాడికి యత్నించిన ఘటన శంషాబాద్లో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి పంజాబ్ వెళ్తున్న సుబర్ణ పాండె అనే ప్రయాణికుడు బోర్డింగ్పాస్ పోగొట్టుకొని ఎయిర్లైన్స్ ఉద్యోగిపై దాడికి యత్నించారు.
అతడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్పోర్టు అధికారులు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఐఏ సీఐ విజయ్కుమార్ తెలిపారు.