కాచిగూడ : దవాఖాన ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనం మాయమయిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం గౌలిపుర, మేకలమండి ప్రాంతానికి చెందిన రాంచందర్ కుమారుడు జాదవ్నర్సింగ్ (28) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ నెల 26న కాచిగూడలోని ప్రతిమ దవాఖాన ముందు టీఎస్ 12 ఈజీ 1003 హీరోహోండా ద్విచక్రవాహనాన్ని పార్కింగ్ చేసి మరుసటి రోజు చూసేసరికి వాహనం కనబడలేదు. దీంతో మంగళవారం నర్సింగ్ కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.