మారేడ్పల్లి : లాడ్జిలో సూసైడ్ నోట్ రాసి అస్సాంకు చెందిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘ టన గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అస్సాంకు చెందిన రాకేష్ (25) అనే యువకుడు రెండు రోజుల క్రితం రెజిమెంటల్బజార్లోని ఎస్ఆర్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకొన్నాడు.
శుక్రవారం ఉదయం లాడ్జి సిబ్బంది గది తలుపులు కొట్టగా ఎంతకూ తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా కిటికి గ్రిల్కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు.
అమ్మా నన్ను క్షమించూ అని లేఖ రాసి…తాను కొన్ని ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని, తన బాడీని తన స్వగ్రామానికి చేర్చాలని లేఖ రాసి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని వద్ద దొరికిన ఆధారాలతో కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.
మృతదేహాన్ని గాంధీ మార్చూరీలో భద్రపరిచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు.