హైదరాబాద్ : అధిక వడ్డీల ఆశ చూపించి వందల కోట్లు నొక్కేసిన శిల్పా చౌదరి, శ్రీనివాస్ కృష్ణప్రసాద్ దంపతులు భాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖులతో పాటు పలువురి నుంచి రూ.కోట్ల వసూలు చేసి మోసానికి పాల్పడిన దంపతులను నార్సింగి పోలీసులు అరెస్టు చేసి డిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు బాధితులు ఠాణాకు క్యూ కడుతున్నారు. తాజాగా నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో శిల్పాచౌదరిపై మరో కేసు నమోదైంది.
రూ.2.4కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇప్పటి వరకు శిల్పాచౌదరిపై ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. శిల్పాచౌదరిని కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. పిటిషన్పై విచారణను కోర్టు డిసెంబర్ ఒకటో తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం శిల్పాచౌదరి దంపతులు చంచల్గూడ జైలులో ఉన్నారు.