మారేడ్పల్లి : పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మద్యన గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడడంతో తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చూరీకి తరలించారు. మృతుని వయసు సూమారు 30-35 సంవత్స రాల వయసు ఉంటుందని, ఒంటి పై బ్లూ రంగు జీన్స్ ఫ్యాంట్, బ్లూ రంగు చొక్కా ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. మృతుని సంబంధీకులు ఏవరైనా ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.