కాచిగూడ : అనారోగ్యంతో ఫుట్పాత్పై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏఎస్సై కోటయ్య తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (45) కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో గల సులబ్ కాంప్లేక్స్ ఫుట్పాత్పై అనారోగ్యంతో ఉంటూ ఆదివారం మృతిచెందాడు.
సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురికి తరలించారు. మృతుని ఒంటిపై నీలి రంగు చొక్క, మల్టీ రంగుల లుంగీ ధరించి ఎత్తు 5.4 ఉన్నట్లు తెలిపారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.