డెహ్రాడూన్: ఏనుగును ఢీకొట్టిన రైలు దానిని కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ ఏనుగు అక్కడికక్కడే మరణించింది. ఉత్తరాఖండ్లోని లాల్కువాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రైలు ఢీకొనడనంతో ఏనుగు చనిపోయినట్లు పశ్చిమ గౌలా రేంజ్ అటవీ శాఖ అధికారి తెలిపారు. ఆ ఏనుగును రైలు సుమారు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిందని చెప్పారు. దీంతో తీవ్రంగా గాయపడిన అది అక్కడే చనిపోయిందని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏనుగుల సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు.
మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఏనుగును ఢీకొట్టిన రైలు అక్కడ చాలా సేపు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటవీ ప్రాంతంలో రైలు చాలా సేపు నిలిచిపోవడంతో కొంత భయాందోళన చెందారు.