అహ్మదాబాద్: ఒక ప్రభుత్వ ఉద్యోగి నకిలీ పెయిడ్ లీవ్స్తో రూ.10 కోట్లు నొక్కేశాడు. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని ప్రాథమిక విద్యాశాఖలో డిప్యూటీ అకౌంటెంట్గా పనిచేస్తున్న రాజేష్ రామి భారీ మోసానికి పాల్పడ్డాడు. అహ్మదాబాద్ జిల్లాలోని ఎనిమిది తాలూకాల్లోని ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయుల పేరుతో సుమారు 5000 నకిలీ పెయిడ్ లీవ్స్ను అప్లై చేశాడు. ఆ పెయిడ్ లీవ్స్ను రూ.9.99 కోట్ల మేర నగదుగా మార్చుకుని తన, కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు.
2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు తాలూకాలు సమర్పించిన డాక్యుమెంట్లను అధికారులు ఆడిట్ చేయగా ఈ విషయం బయటపడింది. దీంతో సంబంధిత అధికారులు ఈ నెల 15న రాజేష్ రామి చీటింగ్పై కరంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, ఆర్థిక ఏడాది 2016-17 నుంచి 2020-21 మధ్యలో అతడు ఈ స్కామ్కు పాల్పడి ఉంటాడని, రెండు ఏండ్ల ఆడిట్లో తేలిన రూ.10 కోట్ల కంటే ఎక్కువగానే నొక్కేసి ఉంటాడని విద్యాశాఖ అధికారులు, పోలీసులు భావిస్తున్నారు. ఈ స్కామ్లో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. మరోవైపు నిందితుడు రాజేష్ రామి పరారీలో ఉన్నాడు.