ఏన్కూరు:మండలంలోని తూకలింగన్నపేట అంబేద్కర్నగర్కాలనీకు చెందిన గ్రామదీపిక రూ.7,63,515 నిధులు స్వాహా చేసినట్లు సోషల్ఆడిట్లో తేలిన విషయం వాస్తవమేనని అడిషనల్ పీడీ జయశ్రీ తెలిపారు. సోమవారం అంబేద్కర్నగర్కాలనీలో మహిళా సంఘాల సభ్యులతో చర్చించారు. సభ్యులకు నష్టం జరగకుండా గ్రామదీపిక నుంచి స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామదీపిక నుంచి గత నెల 30న రూ.3.50 లక్షలు రికవరీ చేయడం జరిగిందని, మరో రూ.4,13,515 ఒకటి రెండురోజుల్లోనే రికవరీ చేసి, గ్రామదీపికపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి ఆర్ఎం శ్రీనివాసరావు, జిల్లా మేనేజర్ సైదేశ్వరరావు, ఏపీఎం హరినారాయణ పాల్గొన్నారు.