హైదరాబాద్ : నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయవాది సురేశ్బాబుపై నిందితుడు నాగేశ్వర్ రావు దాడి చేశాడు. తనకు వ్యతిరేకంగా కేసు వాదిస్తే చంపుతానంటూ లాయర్ సురేశ్బాబును నాగేశ్వర్ రావు బెదిరింపులకు గురి చేశాడు. ఈ దాడితో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ్నుంచి నాగేశ్వర్ రావు పరారీ అయ్యాడు. నాగేశ్వర్ రావుపై న్యాయవాది సురేశ్బాబు బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.