అహ్మదాబాద్ : ఇంటర్నెట్లో అశ్లీల కంటెంట్ను చూడటంతో పాటు తాను ప్రేమలో పడిన మహిళ కోరికలు తీర్చేందుకు ఓ వ్యక్తి తన యజమానిని 2019 నుంచి 2020 మధ్య రూ కోటి వరకూ మోసగించిన ఘటన గుజరాత్లో వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడితో పాటు మరో ఇద్దరిని రాజ్కోట్లో అరెస్ట్ చేశారు. గ్రాఫిక్ డిజైనర్ ఇర్ఫాన్ షేక్కు చెందిన సంస్థలో అకౌంటెంట్గా పనిచేసే నిందితుడు తుషార్ సెజ్పాల్ నెట్లో అశ్లీల కంటెంట్ చేసేందుకు అలవాటు పడ్డాడు.
అశ్లీల కంటెంట్ను వీక్షించేందుకు సంస్ధ బ్యాంక్ ఖాతా నుంచి రూ 16 లక్షలు వాడాడు. ఇక ఆన్లైన్లో పరిచయమైన యూపిలోని ఘజియబాద్కు చెందిన సప్నా అనే మహిళతో సన్నిహిత సంబంధం పెట్టుకున్నాడు. సెజ్పాల్ బలహీనతను పసిగట్టిన సప్నా అతడి నుంచి పలమార్లు డబ్బు రాబట్టింది. ఇప్పటివరకూ సప్నాకు ఇర్ఫాన్ సంస్ధ బ్యాంక్ ఖాతా నుంచి సెజ్పాల్ రూ 80 లక్షలు మళ్లించాడు.
చివరికి ఇర్ఫాన్ కొనుగోలు చేసిన ఇంటి ఈఎంఐలను కూడా చెల్లించకుండా ఆ మొత్తాన్ని కూడా సెజ్పాల్ తన ప్రియురాలు సప్నా ఖాతాకు మళ్లించాడు. సెజ్పాల్ రూ కోటి దాకా ఇర్ఫాన్ను మోసం చేశాడని పోలీసులు తెలిపారు. ఇర్ఫాన్ ఫిర్యాదు ఆధారంగా సెజ్పాల్, సప్నా ఆమె తల్లి సహా ఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.