హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కోర్టులో కత్తి కలకలం సృష్టించింది. సాయికిరణ్ అనే యువకుడు కత్తితో కోర్టు లోపలికి ప్రవేశించాడు. సాయి వెంట అతని స్నేహితుడు కూడా ఉన్నాడు. అయితే సాయికిరణ్ కత్తి పట్టుకుని తిరగడాన్ని సెక్యూరిటీ సిబ్బంది పసిగట్టారు. దీంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సాయికిరణ్ సోదరిని ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులకే ఆమెను ప్రియుడు మోసం చేశాడు. ఈ కేసు విచారణ కోర్టులో ఉండటంతో.. అతను కోర్టుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న సాయికిరణ్ తన బావను చంపేందుకు కోర్టుకు చేరుకున్నాడు. కానీ సిబ్బంది అప్రమత్తమై సాయి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సాయికిరణ్తో పాటు అతని బావను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.