భువనగిరి కలెక్టరేట్ : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని హుస్సేనాబాద్కు చెందిన సాయికుమార్(27) ఈ నెల 28న పట్టణంలోని పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో సంఘటన విషయం బయటకు తెలియలేదు. కాగా మృతదేహం నీటిపై తేలి ఉండటాన్ని స్థానికులు గమనించి పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీన పరుచుకుని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుధాకర్ తెలిపారు. మృతుడు సాయికుమార్ గత నెలలో పట్టణంలోని స్టేషన్రోడ్డులో గల ఏటీఎం చోరీకి పాల్పడి జైలు నుంచి విడుదలయ్యాడని, మృతుడికి భార్య కుమారుడు ఉన్నట్లు తెలిపారు.