వికారాబాద్ : వికారాబాద్ సమీపంలోని గోధుమగూడ వద్ద ఉన్న హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్లో దారుణం జరిగింది. ఓ డేంజరస్ గేమ్లో ౩౪ ఏండ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్కు చెందిన సాయి కుమార్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి నిన్న సాయంత్రం అడ్వెంచర్ క్లబ్కు వెళ్లాడు.
బావిలో పడేసిన వస్తువును తీసుకురావాలని గేమ్ నిర్వహించారు. ఈ గేమ్లో భాగంగా సాయికుమార్ బావిలోకి దూకాడు. ఊపిరాడక సాయి చనిపోయాడు. అనంతరం మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.