హైదరాబాద్ : అతనో కూరగాయల వ్యాపారి.. సైకిల్పై తిరుగుతూ తన వ్యాపారాన్ని కొనసాగించేవాడు. అయితే కొంతమంది వ్యాపారులు TVS XL మోపెడ్ వాహనాలపై కూరగాయలు అమ్ముతుండటాన్ని అతను గ్రహించాడు. ఇక ఆ వాహనం కొనాలని ప్రయత్నించాడు. కానీ సరిపడా డబ్బులు లేకపోవడంతో నిరాశకు గురయ్యాడు. ఎలాగైనా మోపెడ్ను దొంగిలించాలని అతను నిర్ణయించుకున్నాడు. అలా రెండేండ్ల కాలంలోనే 23 TVS XL మోపెడ్ వాహనాలను దొంలిగించాడు. మరి ఈ మోపెడ్లను ఎందుకు ఎంచుకున్నాడంటే.. ఇతర బైక్లు అతనికి నడపడం రాదు కాబట్టి.
మల్లాపూర్కు చెందిన ఫరీద్(40) సైకిల్పై కూరగాయలు, పండ్లను అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొందరు మోపెడ్ వాహనాలపై ఆ బిజినెస్ చేయడాన్ని చూశాడు ఫరీద్. ఈ క్రమంలో వారి మాదిరి మోపెడ్పై తన వ్యాపారాన్ని నిర్వహించాలని ఫరీద్ అనుకున్నాడు. కానీ డబ్బులు లేకపోవడంతో.. ఓ TVS XL మోపెడ్ను దొంగిలించాడు. దానిపై కొద్ది రోజులు కూరగాయలు అమ్మిన తర్వాత.. దాన్ని రూ. 10 వేలకు మరొకరికి విక్రయించాడు. ఇలా రెండేండ్ల కాలంలో 23 మోపెడ్ వాహనాలను దొంగిలించినట్లు నాచారం పోలీసులు తెలిపారు. ఇవన్నీ కూడా ఒకే మోడల్కు చెందినవి కావడం విశేషం. ఒక్కో మోపెడ్ను రూ. 10 వేలకు విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫరీద్ను రిమాండ్కు తరలించారు.