బంజారాహిల్స్ : ‘హాస్టల్లో ఉంటానంటూ..’ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పిన ఓ వివాహిత అదృశ్యమయిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం..
బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్న కే.వెంకటసాయికి రెండేండ్ల క్రితం దివ్యరేఖతో వివాహం అయింది. గత కొన్నిరోజులుగా భర్తతో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 13న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్యరేఖ బయటకు వెళ్లిపోయింది.
కొంతసేపటికి తన తాతకు ఫోన్ చేసిన దివ్యరేఖ తనకోసం వెతకవద్దని, తాను దూరంగా వెళ్లి హాస్టల్లో ఉంటానంటూ ఫోన్ కట్ చేసింది. అప్పటినుంచి ఆమె ఫోన్ స్విఛ్ఆఫ్గా వస్తోంది. రెండురోజులుగా అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో భర్త వెంకటసాయి మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.