అమరావతి : కడప కలెక్టరేట్లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. దీంతో అక్కడికి వచ్చిన వారు కొంత సేపు బెదిరిపోయారు. మురళీకృష్ణ అనే వ్యక్తి కలెక్టరేట్లో కత్తితో చొరబడి కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేశాడు. అడ్డు వచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని సైతం బెదిరించాడు. అతన్ని ఎట్టకేలాగు అదుపులోకి తీసుకుని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. అతడు కలెక్టరేట్కు ఎందుకు వచ్చాడు. ఎందుకు దాడికి దిగాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.