న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ యువకుడిని అతికిరాతకంగా హత్య చేశారు. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ మార్కెట్లో మయాంక్(25) అనే యువకుడు తన ఫ్రెండ్తో కలిసి ఉన్నాడు. ఓ ఐదుగురు వ్యక్తులు మయాంక్ వద్దకు దూసుకొచ్చారు. అతనిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు.
అనంతరం దుండుగులు అక్కడ్నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన మయాంక్ను స్థానికుల సహాయంతో అతని స్నేహితుడు ఎయిమ్స్కు తరలించాడు. ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మయాంక్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలన్నీ మార్కెట్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లోరికార్డు అయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మయాంక్ హోటల్ మేనెజ్మెంట్ స్టూడెంట్ అని పోలీసులు పేర్కొన్నారు.