బండ్లగూడ : పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని కారులో షీకారు చేసి వద్దమని బయలుదేరగా డ్రైవర్ అతి వేగంగా నడిపి డీసీఎం కంటైనర్ను వెనుక నుంచి ఢీ కోట్టిన సంఘటనలో ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా మరోకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా నలుగురికి గాయాలయ్యాయి.
ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ ఔటర్రింగ్ రోడ్డు పై చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన విరాల ప్రకారం…ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కాశీనాథ్ తన భార్య వైశాలిదాస్తో కలిసి గచ్చిబౌలి ఇజ్జత్నగర్లో నివాసం ఉంటున్నాడు.
వైశాలీదాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇజ్జత్నగర్లో బర్త్డే వేడుకలు ముగిసిన అనంతరం వేడుకులకు హజరైన వారి స్నేహితులు యాల ప్రేమ్కుమార్, మనోజ్, వైశాలిదాస్, గగన్పహన్లు సాయినాథ్ కారును (ఎపి 13ఎన్ 5121) తీసుకుని అద్దె డ్రైవర్ అయిన సుశీల్గుప్త (24)తో కలిసి శంషాబాద్ ఎయిర్ఫోర్ట్ చూసేందుకు బయలు దేరారు.
దారిలో బ్లాక్ 22 ఫబ్ నుంచి మద్యం కొనుగోలు చేసి సేవించిన అనంతరం తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. శంషాబాద్ వరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉదయం 4ః30గంటల సమయంలో ముందు వెళ్తున్న కంటైనర్ను డీ కొట్టారు.
దీంతో మనోజ్(30) అక్కడిక్కడే మృతి చెందగా మిగతా అయిదుగురిని చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. కాగా మరో యువకుడు సుశీల్గుప్త (30) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రస్తుతం నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.