శేరిలింగంపల్లి : నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఓ పార్చునర్ కారు పల్టీలుకొట్టింది. దీంతో కారు ముందు బాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో బెలూన్లు తెరుచుకొవడంతో ప్రాణాపాయం తప్పినట్టు తెలుస్తోంది. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.
కాగా పల్టీలు కొట్టిన కారు (టీఎస్07ఎఫ్ఎక్స్8444) ను గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబందించి తమకు ఎలాంటి వివరాలు తెలియరాలేదని, కారు ఎవరిది, ప్రమాదం జరిగి పల్టీలు కొట్టినపుడు కారులో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
డ్రైవర్ పరారీలో ఉండడంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీస్తున్నారు. స్థానిక ప్రిజం పబ్ రహాదారిపై ప్రమాదం జరగడంతో మద్యం మత్తులో ప్రమాదం జరిగిందా అనేకోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.