హైదరాబాద్ : తల్లితో నెలకొన్న ఆస్తి వివాదాలు ఓ వ్యాపారవేత్త ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీనివాస్ అనే వ్యాపారవేత్త గోపాలపురంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అయితే గత కొద్ది నెలల నుంచి శ్రీనివాస్కు తన కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు ఉన్నాయి. తల్లి కూడా అతనికి ఆస్తి పంచి ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్.. బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే తల్లి, కుటుంబ సభ్యులు తనకు ఆస్తిలో వాటా ఇవ్వనందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు శ్రీనివాస్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.